ఆత్మహత్యకు పాల్పడ్డ ఆదిత్య ఆస్పత్రి ఎండి
హైదరాబాద్: నగరంలో ఓ ఆస్పత్రి ఎండి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. మేడ్చల్ జిల్లాలోని జవహార్ నగర్లో గల ఆదిత్య ఆస్పత్రి ఎండి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిత్య ఆస్పత్రి ఎండి తుపాకీతో కాల్చుకుని ఈ ఉదంతానికి పాల్పడ్డాడు. అయితే ఆదిత్య ఆస్పత్రి ఎండి రవికుమార్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/