ప్రశాంతంగా ముగిసిన హుజురాబాద్ , బద్వేల్ ఉప ఎన్నిక
ఎంతో ఉత్కంఠగా సాగిన హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. రాత్రి 7 గంటల వరకు 86.4 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ పోలింగ్లో చిన్న చిన్న ఘర్షణలు తప్ప ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదని, మొత్తం మీద పోలింగ్ ప్రశాతంగా ముగిసిందని వెల్లడించారు. పోలింగ్ సమయం ముగిసినా క్యూలైన్లో ఉన్న వారికి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు అధికారులు. 2018లో 84.42 శాతం పోలింగ్ నమోదు కాగా, గత రికార్డును బ్రేక్ చేసే దిశగా పోలింగ్ సాగింది. ఈవీఎంలను సీజ్ చేసి భద్రపరిచారు.
ఏపీలోని బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. పోలింగ్ సందర్భంగా అక్కడక్కడ చిన్న పాటి ఘర్షణలు తప్ప మొత్తం మీద ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. సమయం ముగిసినా క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.