పునీత్ పార్థివ దేహాన్ని చూసి తట్టుకోలేకపోయిన కూతుళ్లు..వారిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు

పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ఆదివారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం పునీత్ గుండెపోటు తో కన్నుమూసిన సంగతి తెలిసిందే. పునీత్ మరణ వార్త యావత్ అభిమానులను , సినీ ప్రముఖులను శోక సంద్రంలో పడేసింది. ప్రస్తుతం అబిమానులను సందర్శనార్థం కంఠీరవ స్టేడియం లో ఉంచారు.

తండ్రి పార్థివ దేహం చూసిన కూతురు ధృతీ రాజ్ కుమార్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ చిన్నారికి కన్నీళ్ళు ఆగడంలేదు. గుండెల నిండా తండ్రి గురుతులు కదలాడుతుంటే.. తండ్రి ఇక రాడన్న వాస్తవం జీర్ణించుకోలేకపోయింది. ప్రపంచంలో ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదని అక్కడికి వచ్చిన వారు ఆవేదన వ్యక్తం చేశారు. అతి చిన్నవయసులో పునీత్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆయన కుటుంబం తల్లడిల్లిపోతోంది. వారిని ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు.

బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, ఎన్టీఆర్ ఇలా హీరోలందరూ కూడా పునీత్‌ను చివరి చూపు చూసుకుని వచ్చారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు తాజాగా పునీత్ రాజ్ కుమార్‌ను తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. మీ ముగ్గురు అన్నదమ్ముళ్లను చూస్తే.. మా అన్నదమ్ములం గుర్తుకు వస్తామని ఆయనతో ఉన్న మెమోరీస్‌ను నాగబాబు గుర్తుకు చేసుకున్నారు.

‘డియర్ పునీత్.. నువ్ ఎప్పుడూ నాకు తమ్ముడిలాంటివాడివే. ఎవ్వరూ ఊహించటనట్టుగా నువ్ ఎప్పుడూ నా సోదరుడివే. మీ ముగ్గురు అన్నదమ్ములు.. మా ముగ్గురిలా కనిపిస్తారు.. అంతే కాకుండా కళ్యాణ్ బాబులా మీరు కూడా పవర్ స్టార్ అని పేరొందారు.. అయితే కేవలం ఇవే కారణాలు కాదు.. మీరు చేసిన మంచి పనులు, మీ చారిటీలు, సేవా గుణం, మంచి మనసుల ఇలా అన్నింటితో మీరు కేవలం నటుడిగానే కాకుండా మంచి మనిషిగానూ అందరి హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు.