బద్వేల్ లో మధ్యాహ్నం 3 గంటల వరకు 44.82 శాతం పోలింగ్
బద్వేల్: బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు బద్వేల్లో 44.82 శాతం పోలింగ్ నమోదయ్యింది. బద్వేల్ ఉప ఎన్నికను వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు సీఈఓ విజాయనంద్. రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి విజయానంద్ పర్యవేక్షిస్తున్నారు. బద్వేల్ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతుంది అన్నారు. ఇప్పటివరకు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తెలిపారు. దొంగ ఓటర్లను తరలిస్తున్నారన్నది అబద్ధం అని విజయానంద్ తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/