అమరావతి నోటిఫై కాలేదని అరిచారు

రాజధానిగా అమరావతి నోటిఫై అయ్యిందని కేంద్రం క్లారిటీ ఇచ్చింది

buddha venkanna
buddha venkanna

అమరావతి: వైఎస్సార్‌సిపి ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌కు కౌంటర్‌గా టిడిపి నేత బుద్ధా వెంకన్న ట్వీట్‌ చేశారు. రాజధానిగా అమరావతి నోటిఫై కాలేదు అంటూ అరిచారు. కేంద్రం 23.04.2015నే అమరావతి రాజధానిగా నోటిఫై అయ్యింది అని క్లారిటీ ఇవ్వడంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మైండ్‌ బ్లాంక్‌ అయ్యిందిని ఎద్దేవా చేశారు. రాజధాని తరలించడానికి ఇంకా ఏమైనా అడ్డదారులు ఉన్నాయా అని వెతుక్కునే పనిలో పడ్డారు విధ్వంసకారుడు సీఎం జగన్‌గారని విమర్శించారు. ఇంకా మరో ట్వీట్‌లో కేంద్రంలో ఉన్న బిజెపి సైతం తుగ్లక్‌ మూడు రాజధానుల నిర్ణయాన్ని ఛీ కొట్టడంతో ఏం చెయ్యాలో పాలుపోక ఢిల్లీలో కనపడిన అందరి కాళ్లు పట్టుకుంటాన్నారట కదా విజయసాయిరెడ్డిగారు!! అని బుద్ధా వెంకన్న వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/