రాహుల్ గాంధీ చేయి పట్టుకోవడం ఫై పూనమ్ క్లారిటీ

తెలంగాణ లో రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర వివాదాస్పదమైంది. ప్రస్తుతం రాహుల్ యాత్ర మహబూబ్ నగర్ లో కొనసాగుతుంది. ఈ క్రమంలో ఈ యాత్ర లో ప్రముఖ నటి పూనమ్ కౌర్ పాల్గొని , రాహుల్ చేయి పట్టుకొని నడిచింది. అంతే ఆ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. రాహుల్ చేయి పట్టుకొని నడవడం తో పలు రకాల కామెంట్స్ చేస్తూ వైరల్ చేసారు.

ఈ పిక్ ఫై మహారాష్ట్ర బిజెపి నాయకురాలు ప్రీతీ గాంధీ.. రాహుల్, పూనమ్ కలిసి నడుస్తున్న ఫొటోను షేర్ చేసి.. తన తాత అడుగుజాడల్లో నడుస్తున్నారు.. అంటూ పోస్ట్ చేసింది. ఈ ఫోటో వైరల్‌గా మారడంతో దీనిపై పూనమ్ స్పందించింది. ఇది చాలా అవమానకరం అని పేర్కొన్నారు. నేను జారిపడబోతే రాహుల్ గాంధీ నా చేయి పట్టుకున్నారు అని స్పష్టం చేశారు. అటు, ప్రీతి గాంధీ ట్వీట్ పై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. మోడీ మహిళలతో ఉన్న ఫొటోలను పోస్టు చేసి ప్రీతికి కౌంటర్ ఇచ్చారు.