ఎమ్మెల్యే ల కొనుగోలు ఫై కేసీఆర్ ఫైర్..

టిఆర్ఎస్ ఎమ్మెల్యే ల కొనుగోలు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొనుగోలు వ్యవహారం జరిపిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ వ్యవహారం తమకు ఎలాంటి సంబంధం లేదని బిజెపి నేతలు చెప్పడమే కాదు..బిజెపి రాష్ట్ర అధ్యకుడు బండి సంజయ్ యాదాద్రి టెంపుల్ లో కొనుగోలు వ్యవహారం తో సంబంధం లేదని ప్రమాణం చేసారు.

ఇదిలా ఉంటె ఫస్ట్ టైం ఈ వ్యవహారం ఫై సీఎం కేసీఆర్ స్పందించారు. బంగారిగడ్డ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్..బిజెపి తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘ఈరోజు నాతో పాటు నలుగురు తెలంగాణ బిడ్డలు హైదరాబాద్‌ నుంచి మునుగోడు వచ్చారు. నిన్నామొన్న కొంత మంది ఢిల్లీ బ్రోకర్‌గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్నే కొందామని.. మీకు వంద కోట్ల రూపాయలు ఇస్తాం.. మీరు పార్టీ విడిచిపెట్టి రమ్మని చెప్పి.. వాళ్లను ఎడమకాలి చెప్పుతో కొట్టి అమ్ముడుపోవుడు కాదురా.. మేం అంగట్లో సరుకు కాదు.. తెలంగాణ బిడ్డలమని.. తెలంగాణ ఆత్మగౌర బావుటాను హిమాలయపర్వతం అంత ఎత్తుకు ఎత్తారు.

తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రెగా కాంతారావు లాంటివారు కావాలి రాజకీయాలకు. జాతి గౌరవాన్ని, దేశగౌరవాన్ని అంగట్లో పశువుల్లా అమ్ముడుపోకుండా.. వందకోట్లు ఇస్తామన్నా గడ్డిపోచతో సమానంగా విసిరికొట్టి తెలంగాణను కాపాడిన బిడ్డలు. వందల కోట్ల అక్రమ ధనం తెచ్చి శాసనసభ్యులను, పార్లమెంట్‌ సభ్యులను, ఇతరులను సంతలో పశువుల్లా కొని ప్రభుత్వాలను కొలగొట్టే అరాచక వ్యవస్థ మంచిదా? అని ప్రశ్నించారు.