టర్కీ లో బాలయ్య సందడి మాములుగా లేదు

టర్కీ లో నందమూరి బాలకృష్ణ సందడి చేస్తున్నాడు. అఖండ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలకృష్ణ..ప్రస్తుతం క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తన 107 వ సినిమా చేస్తున్నాడు. శృతి హాసన్ ఈ మూవీ లో బాలకృష్ణ కు జోడిగా నటిస్తుండగా..థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్ప‌టికే కొంత మేర‌కు చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ..తాజా షెడ్యూల్ టర్కీ లో మొదలుపెట్టారు.

ఈ సందర్భంగా బాలయ్య టర్కీలోని ఓ రెస్టారెంట్ కి వెళ్లారు. అక్కడ ఓ కుటుంబంతో కలిసి టిఫిన్ చేసారు. వారితో కాసేపు సరదాగా కబుర్లు చెప్పారు. “హేభాయ్ టిఫిన్ చేసేసా. ఇక మందులు వేసుకునే సమయం అయింది. ఓ వైపు హిందుపురం ఎమ్మెల్యేగా.. మరోవైపు బసవతారకం ఆసుపత్రి చైర్మెన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా.

ఇలా ఇన్ని పనులు చేయడం వల్ల ఆనందంగా ఉంది. ఏ పనిచేయకుండా ఖాళీగా కూర్చునే వాళ్లకి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తాయన్నారు”. అనంతరం ఓ మహిళను చూపించి…. “వీళ్లు ఇంట్లో కూర్చుని సీరియళ్లు చూస్తుంటారు. మైండ్ పాడు చేసుకుంటారు. నా ఉద్దేశం ప్రకారం టీవీ తక్కువ చూస్తే కళ్లకు మంచిది. అసలు చూడకపోతే మెదడుకి మంచింది అని చెప్పుకొచ్చారు. బాలయ్య మాటలతో ఆ కుటుబం నవ్వుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.