భారత్-‌చైనా ఉద్రిక్తత..సాయం చేయడానికి సిద్ధం

donald trump
donald trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్-‌చైనా సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఘర్షణలపై స్పందించారు. భార‌త్‌, చైనా మ‌ధ్య స‌రిహ‌ద్దు స‌మ‌స్య దారుణంగా మారింద‌న్నారు. ఈ స‌మ‌స్య ప‌రిష్కారంలో స‌హాయం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్న‌ట్లు ట్రంప్ తెలిపారు. ఈస్ట్ర‌న్ ల‌డాఖ్‌లో భార‌త్‌, చైనా ద‌ళాలు వాస్త‌వాధీన రేఖ వెంట మోహ‌రించ‌డంతో.. అక్క‌డ ప‌రిస్థితి భ‌యాన‌కంగా మారింది. భార‌త్‌, చైనా బోర్డ‌ర్ స‌మ‌స్య విప‌త్క‌రంగా ఉంద‌ని, చైనా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. రెండు దేశాల‌తోనూ ఈ అంశం గురించి చ‌ర్చించాన‌ని, హెల్ప్ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్న‌ట్లు ట్రంప్ చెప్పారు. ఒక‌వేళ మేం ఏదైనా చేయాల‌నుకుంటే, ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌గ‌ల‌మ‌ని, వారికి హెల్ప్ చేయ‌గ‌ల‌మ‌ని ట్రంప్ అన్నారు. ఈ విష‌యంపై రెండు దేశాల‌తోనూ సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు ట్రంప్ చెప్పారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/