జేఎన్‌యూ దాడులకు తామే బాధ్యులం

ప్రకటించిన హిందూ రక్షాదళ్‌

hindu-raksha-dal
hindu-raksha-dal

న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఆదివారం సాయంత్రం విద్యార్థులు, అధ్యాపకులపై జరిగిన దాడికి తామే బాధ్యులమని హిందూ రక్షా దళ్ ప్రకటించింది. జెఎన్‌యు క్యాంపస్‌లో ముఖాలకు గుడ్డలు కట్టుకుని, చేతిలో రాడ్లు ధరించి వీడియోలలో కనిపించిన ఇద్దరు వ్యక్తులు ఎబివిపికి చెందిన వారిగా ఎబివిపి ఢిల్లీ విభాగం సంయుక్త కార్యదర్శి అనిమా సోంకర్ ఒక జాతీయ టీవీ చానల్‌లో ఒప్పుకున్న దరిమిలా హిందూ రక్షా దళ్ నుంచి ఈ రకమైన ప్రకటన రావడం గమనార్హం. హిందూ రక్షా దళ్ నాయకుడు భూపేంద్ర తోమర్ అలియాస్ పింకీ చౌదరి ట్విట్టర్ వేదికగా ఒక వీడియోను పోస్ట్ చేస్తూ జెఎన్‌యు క్యాంపస్‌లో జాతి వ్యతిరేక, హిందై వ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నందునే తమ కార్యకర్తలు దాడి చేశారని చెప్పారు. జెఎన్‌యు కమూనిస్టుల స్థావరంగా మారిందని, అలాంటి స్థావరాలను తాము సహించబోమని ఆయన హెచ్చరించారు. తమ దేశాన్ని, తమ మతాన్ని దూషిస్తారని, వారంతా జాతి వ్యతిరేకులని తోమర్ ఆరోపించారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే ఇతర యూనివర్సిటీలలో కూడా ఇదే రకమైన చర్యకు పాల్పడతామని ఆయన హెచ్చరించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/