గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు
కింది కోర్టు తీర్పును సస్పెండ్ చేయడానికి నిరాకరించిన హైకోర్టు
అహ్మాదాబాద్: పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులో చుక్కెదురయింది. మోడీ ఇంటి పేరుతో రాహుల్ వ్యాఖ్యలు చేసిన కేసులో అతనికి రెండేళ్ల శిక్ష పడిన విషయం తెలిసిందే. ఆ కేసులో రాహుల్ గాంధీ తన ఎంపీ స్టేటస్ను కోల్పోయారు. అయితే సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.
కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈరోజు హైకోర్టు సమర్థించింది. సూరత్ ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. దీంతో రాహుల్ గాంధీ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోయారు. అయితే ఈ కేసు విషయంలో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది.