రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు..వాతావరణ శాఖ
హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణశాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఈరోజు సాయంత్రం వరకు తెలంగాణ, ఏపిలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో దక్షిణ భారతదేశంలో రుతుపవనాలు బలపడుతాయని పేర్కొంది. అదేవిధంగా వచ్చే మూడు, నాలుగు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమలో వానలు పడుతాయని వెల్లడించింది. పిడుగులు పడే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/