భారీ వర్షాలతో దేశ రాజధాని అతలాకుతలం

గత కొన్ని రోజులుగా ఢిల్లీలో రికార్డు స్థాయి వానలు
ఈ తెల్లవారుజామున కుండపోత

న్యూఢిల్లీ: భారీ వర్షాలు దేశ రాజధాని ఢిల్లీని కుదిపేస్తున్నాయి. గత కొన్ని రోజుల గా ఢిల్లీలో రికార్డుస్థాయిలో వానలు కురుస్తున్నాయి. ఇక, నిన్న ఉదయం నుంచి చిన్నగా కురుస్తున్న వర్షం ఈ ఉదయం కుండపోతగా మారింది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏకధాటిగా కురిసిన వానకు రహదారులపైకి నడుము లోతులో నీళ్లు చేరి నదులను తలపిస్తున్నాయి.

భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ ఎక్కిడికక్కడ నిలిచిపోయింది. అండర్ పాస్ వంతెన వద్ద నీరు చేరడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను నిలిపివేశారు. రాగల 12 గంటల్లో ఢిల్లీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/