తిరుమల శ్రీవారి లడ్డు ఉచిత పంపిణి

తమ సిబ్బందికే అంటున్న టీటీడి

tirumala laddu
tirumala laddu

తిరుమల; ఒకవైపు దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడం, మరొకవైపు రాష్ట్రము లో కరోనా అనుమానితుల సంఖ్య ఎక్కువ అవుతుండడంతో టీటీడి వెంకన్న ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. అయితే తిరుపతి వెంకన్న ప్రసాదానికి ఉన్న డిమాండ్ నేపథ్యంలో లడ్డులను అధికంగా తయారు చేశారు. ఇపుడు తిరుమల ఆలయం మూసివేయడంతో లడ్డులు అలాగే ఉండిపోయాయి. ఈ లడ్డులను టీటీడి తమ సిబ్బందికి ఉగాది కానుకగా ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఆలయం మూసి ఉండడంతో స్వామి వారి కైంకర్యాలు అన్ని అర్చకులు నిర్వహిస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి;https://www.vaartha.com/telangana/