కేరళలో ఆరు జిల్లాల్లో రెడ్ అలర్ట్

తిరువనంతపురం: భారీ వర్షాలు, వరదలతో కేరళ వణికిపోతున్నది. ఎక్కడ చూసినా నీటితో మునిగిపోయిన రోడ్లు, వర్షపునీటిలో చిక్కుకున్న ఇళ్లే కనిపిస్తున్నాయి. దీనికితోడు కేరళలో వచ్చే 24 గంటల్లో అతిభారీ వర్షాలు కురుస్తామని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో కాసరగోడ్, కల్నూల్, వైనాడ్, కోజికోడ్, మల్లపురం, అలక్పూజ జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాగల 24 గంటల్లో ఈ జిల్లాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/news/international-news/