సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ వాయిదా

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా పడిందని తెలుస్తోంది. లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లను రద్దు చేయాలని కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

తనపై ఎలాంటి బలవంతపు చర్యలూ ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కవిత తన పిటిషన్ లో కోరారు. అయితే సర్వోన్నత న్యాయస్థానంలో కోర్టు నంబర్ 2, 8 కార్యకలాపాలు నేడు రద్దయ్యాయి. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అందుబాటులో లేని కారణంగా సోమవారం కోర్టు నంబర్ 2 కార్యకలాపాలు రద్దయ్యాయి. దీంతో కవిత పిటిషన్ పై కూడా విచారణ వాయిదా పడింది.