నెల్లూరు జిల్లాలో దారుణం : 19 ఏళ్ల యువతీ ఫై హెడ్ కానిస్టేబుల్ అత్యాచారయత్నం

మహిళలకు రక్షణ గా ఉండాల్సిన రక్షభటులే వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతుంటే ఇక ఆడవారికి రక్షణ ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఏపీలో గత కొంతకాలంగా ఆడవారికి రక్షణ లేకుండా పోతుందని..ఒంటరి మహిళలపైనే కాకుండా అభం శుభం తెలియని చిన్నారులపై అత్యాచారాలు చేస్తున్నారని..ప్రభుత్వం ఎన్ని కఠిన శిక్షలు విదిస్తున్నప్పటికీ కామాంధుల్లో మార్పు రావడం లేదని రాష్ట్ర ప్రజలు గగ్గోలు పెడుతుంటే..తాజాగా ఓ హెడ్ కానిస్టేబుల్ 19 ఏళ్ల యువతీ ఫై అత్యాచారయత్నం చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.

బిట్టమూరు పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని చిట్టమూరు పోలీస్ స్టేషన్‌లో సుధాకర్ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ సమస్యపై తండ్రి కూతురు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అయితే.. వారు సుధాకర్‌ను సంప్రదించగా.. బాలికకు కౌన్సిలింగ్ ఇస్తానని తండ్రితోపాటు ఆమెను ఇంటికి పిలిపించుకున్నాడు. సదరు యువతి తండ్రిని ఇంటికి సమీపంలోని ఓ షాపుకి పంపించాడు. అనంతరం సుధాకర్ ఒంటరిగా ఉన్న యువతీపై అత్యాచారానికి యత్నించాడు. ఎవరికైనా చెబితే హాని తలపెడతానికి బెదిరించడంతో యువతీ అప్పుడు నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఇంటికి వెళ్లగానే యువతీ జరిగిన విషయాన్ని తండ్రికి చెప్పింది. దీంతో యువతీ, ఆమె తండ్రి బిట్టమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సుధాకర్‌ను అదుపులోకి తీసుకోని విచారించారు. పోలీసుల విచారణలో యువతీపై అత్యాచారయత్నం జరిగినట్లు తేలడంతో ఫోక్సోచట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.