చిత్రసీమలో మరో విషాదం : హీరో హరనాథ్ కూతురు మృతి

చిత్రసీమలో వరుస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎంతోమంది దిగ్గజ నటి నటులు మృతి చెందగా..తాజాగా మరో విషాదం చోటుచేసుకుంది. నటుడు హరనాథ్ కుమార్తె పద్మజ రాజు(54) మంగళవారం గుండెపోటుతో మరణించారు.

ఇటీవల పద్మజా రాజు తన తండ్రి హరనాథ్ జీవితంపై ‘అందాల నటుడు’ అనే పుస్తకాన్ని సూపర్ స్టార్ కృష్ణ చేతులమీదుగా ఆవిష్కరించారు. పద్మజా రాజు భర్త జీవీజీ రాజు పవన్ కల్యాణ్ తో గోకులంలో సీత, తొలిప్రేమ వంటి హిట్ సినిమాలను తెరకెక్కించారు. గోదావరి చిత్రం కూడా జీవీజీ రాజు నిర్మాణంలోనే తెరకెక్కింది. పద్మజా రాజు మాట్లాడుతూ.. త్వరలోనే తన కుమారుల్లో ఒకరు నిర్మాతగా పరిచయం చేస్తున్నానని తెలిపారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని, వచ్చే ఏడాదికల్లా తన ఇంటి నుంచి మరో నిర్మాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడతాడని పద్మజా రాజు చెప్పుకొచ్చారు. అయితే ఇంతలోనే ఆమె కన్నుమూయడం విషాదకరం.