హరితహారం కోసం వారి జీతాల నుండి కోత పెట్టబోతున్న కేసీఆర్

తెలంగాణ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ హరితహారం కోసం ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుండి కోత పెట్టబోతున్నారు కేసీఆర్. హరితహారానికి ప్రభుత్వ నిధులతో పాటు మరింత నిధులను సమీకరించడానికి ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. దీని కోసమే హరిత నిధి పేరుతో ప్రత్యేక నిధులను సేకరించే ప్రణాళికను రూపోందించింది. ఎమ్మెల్యేలు మొదలుకుని ఉద్యోగుల దాకా ప్రతీనెల జీతం నుంచి కొంత నిధిని సేకరించాలని ఆలోచన చేశారు.

ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల జీతాల నుంచి ప్రతీ నెల రూ. 500, ఐఏఎస్,ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల జీతాల నుంచి నెల రూ. 100, ఇతర ఉద్యోగుల నుంచి రూ. 25 చొప్పున అందరి అనుమతితో నిధులను సమీకరించేలాా ప్రణాళిక రూపొందించారు. ఇదే కాకుండా బార్లు, వైన్స్, ఫెర్టిలైజర్ షాపులు, ఇతర వ్యాపార లైసెన్సుల రీన్యువల్ టైంలో ఏడాదికి రూ. 1000 చొప్పున వసూలు చేసేలా నిబంధన తీసుకురానున్నారు. అలాగే భూముల కొనుగోలు రిజిస్ట్రేషన్ సమయంలో రూ. 50చొప్పున హరిత నిధిని తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు.