ఏపీ మంత్రులను హెచ్చరించిన బిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు

‘‘ఆంధ్రా మంత్రులు అనవసరంగా మా జోలికి రాకండి… మా గురించి ఎక్కువ మాట్లాడకపోతే మీకే మంచిది’’ అంటూ హెచ్చరించారు బిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తు వస్తున్న కేసీఆర్..తాజాగా విశాఖ ఉక్కు బిడ్డింగ్ లో పాల్గొనాలని నిర్ణయించారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఫై ఏపీ ప్రజలు , ప్రతిపక్ష పార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే వైస్సార్సీపీ నేతలు మాత్రం పలు విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో వారికీ హెచ్చరిక జారీ చేసారు బిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు.

‘‘మీ దగ్గర ఏమున్నదని ఓ మంత్రి అంటున్నారు. ఏముందో వచ్చి చూడండి. మా దగ్గర 56 లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉంది. కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, రైతు బీమా, రైతు బంధు ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం‌ నిర్మించాం. మీ దగ్గర ఏమున్నాయి?’’ అని హరీష్ రావు ప్రశ్నించారు.

‘‘ఆనాడు ప్రత్యేక హోదా కావాలని అన్నారు.. ఇప్పుడేమో అడగరు. హోదా అంశాన్ని కేంద్రం పక్కకి పెట్టినా పట్టించుకోరు. విశాఖ ఉక్కు అమ్ముతున్నా మాట్లాడరు. అధికారంలా ఉన్న వాళ్లు అడగరు.. ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు ప్రశ్నించరు. విశాఖ ఉక్కును తుక్కుకి అమ్మిన ఎవ్వరు నోరెత్తరు. ప్రజలను గాలికి వదిలేశారు.. మీ ప్రయోజనాలు చూసుకుంటున్నారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కలిసి ఏపీని ఆగం చేశాయి’’ అని ఆరోపించారు.