మరోసారి చంద్రబాబు సభ లో అపశృతి..తొక్కిసలాటలో ముగ్గురు మృతి

మరోసారి చంద్రబాబు సభ లో అపశృతి చోటుచేసుకుంది. రీసెంట్ గా కందుకూరి సభలో తొక్కిసలాట చోటుచేసుకోగా..8 మంది వరకు చనిపోగా ..ఇప్పుడు మరోసారి అలాంటి ఘటనే గుంటూరు లో జరిగింది. గుంటూరులో చంద్రబాబు జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించి వెళ్లిపోయిన అనంతరం తొక్కిసలాట నెలకొంది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. సభా వేదిక వద్ద ఒకరు మరణించగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మృతులు గోపిశెల్లి రమాదేవి, ఆసియాగా తెలుస్తోంది. ఈ ఘటన పట్ల స్థానికులు మండిపడుతున్నారు.