లోకేష్ ను మరోసారి మడతపెట్టేస్తాం – మంత్రి అమర్నాథ్
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీ లు ప్రచారాన్ని ముమ్మరం చేసాయి. అధికార పార్టీ , ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ముఖ్యంగా టీడీపీ గుంటూరు కారం లోని ‘కుర్చీ మడతపెట్టి’ డైలాగ్ ను జగన్ ఫై వాడుతూ వార్తల్లో నిలుస్తున్నారు.
ఈ క్రమంలో వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాద్ ..లోకేష్ ఫై నిప్పులు చెరిగారు. జగన్ దెబ్బకు నారా లోకేష్ నాలుక, చంద్రబాబు కుర్చీ ఎప్పుడో మడతడిపోయాయని అమర్నాథ్ అన్నారు. కుర్చీలు కాదు.. లోకేష్ నాలుక మడత తీస్తే కనీసం నాలుగు పదాలైన సరిగ్గా పలుకుతాడని ఎద్దేవా చేశారు.
విశాఖలో మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. లోకేష్ కుర్చీని 2019లో మంగళగిరిలో మడతపెట్టామని, ఇప్పుడు అతని కుర్చీ అతనే మడత బెట్టుకుంటున్నాడన్నారు. మంగళగిరిలో నారా లోకేష్ను మరోసారి మడత పెట్టేస్తామన్నారు. రెడ్బుక్ను ఎక్కడ మడత పెట్టుకుంటావో నీ ఇష్టం లోకేష్ అంటూ మంత్రి అమర్నాథ్ సెటైర్లు వేశారు. నారా లోకేష్ ఎంత సీరియస్నెస్ క్రియేట్ చేసినా.. అతని కామెడీ ఫేస్ అందుకు సూటవ్వదన్నారు.