కాలు జారి కింద పడిన గవర్నర్ తమిళి సై

తెలంగాణ గవర్నర్ తమిళి సై కాలు జారి కింద పడిపోయారు. ఆదివారం తమిళనాడు లో జరిగిన హైబ్రిడ్ రాకెట్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె నడుస్తూ నడుస్తూనే ఒక్కసారిగా కాలు స్లిప్ అయ్యి కిందపడి పోయారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆమెను లేపి నిలుచోబెట్టారు. అయితే ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు కానీ తాను కిందపడిపోయినందున ఈ వార్త టీవీల్లో హైలైట్ అవుతుందంటూ సరదాగా పేర్కొన్నారు.

ఇక హైబ్రిడ్ రాకెట్ ప్రయోగ కార్యక్రమం తమిళనాడులోని మామల్లపురం సమీపంలోని పత్తిపులం గ్రామంలో జరిగింది. తెలంగాణతో పాటు తమిళిసై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె హైబ్రిడ్ రాకెట్ ప్రయోగ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రసంగించారు. అనంతరం ఆమె నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా కార్పెట్‌పై జారి పడిపోయారు. సుమారు 3500 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 6 నుంచి 12వ తరగతి చదివే 5వేల మంది విద్యార్థులు తయారుచేసిన 150 మినీ హైబ్రి డ్‌ ఉపగ్రహాల (పైకో శాటిలైట్స్‌)ను ప్రయోగించారు. ఈ రాకెట్‌ ప్రయోగాన్ని డాక్టర్‌ ఏపీఏ అబ్దుల్‌ కలాం ఇంటర్నే షనల్‌ ఫౌండేషన్‌, మార్టిన్‌ ఫౌండేషన్‌, స్పేస్‌ జోన్‌ ఇండియా సంయుక్తం గా చేపట్టాయి.