TSRTC కార్మికులకు శుభవార్త..

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు దీపావళి కానుక ఇచ్చేందుకు సిద్ధమైంది యాజమాన్యం. చాలాకాలంగా కార్మికులు ఎదురుచూస్తున్న 2013 PRC బకాయిలను దీపావళికి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది సంస్థ. ఇందుకోసం ఏకంగా 210 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖ ఆదేశించినట్లు సమాచారం.

అయితే 2013, 2017, 2021 PRC తో పాటు ఇతర బకాయిలతో కలిపి సుమారు 2000 కోట్ల వరకు ఆర్టీసీ చెల్లించాల్సి ఉంది. అయితే లోటు బడ్జెట్ కారణంగా ఆ మొత్తాన్ని ప్రస్తుతం చెల్లించలేక పోతుంది. ప్రస్తుతానికి 2013 పిఆర్సిని ఈ దీపావళికి అందించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అతి త్వరలో రానుందని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే దసరా పండుగ తెలంగాణ ఆర్టీసీ కి భారీగా లాభాలను తీసుకొచ్చింది. అనేక రూట్లలో ప్రత్యేక బస్సులు వేయడం..ఎలాంటి అదనపు చార్జీలు వసూళ్లు చేయకపోవడంతో ప్రయాణికులు ఆర్టీసీ వైపే మొగ్గు చూపారు. దీంతో ఆర్టీసీ కి భారీ లాభాలు అందినట్లు సమాచారం.