దేశంలో కొత్తగా 2139 కరోనా కేసులు

corona virus-india

న్యూఢిల్లీః దేశంలో గడిచిన 24 గంటల్లో 2139 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,18,533కు చేరింది. ఇందులో 4,40,63,406 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,835 మంది మృతిచెందారు. మరో 26,292 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 9 మంది మరణించారని, 3208 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

మొత్తం కేసుల్లో 0.06 కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపింది. రికవరీ రేటు 98.75 శాతం, మరణాలు 1.2 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 0.71 శాతంగా ఉందని ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 219.04 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/