18 ఏళ్లు దాటినా వారికీ టీకా..జీహెచ్ఎంసీలో 100 సెంటర్లు

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు వ్యాక్సిన్ డోసులు

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటివరకు 45 ఏళ్లకు పైబడిన వారికే కరోనా వ్యాక్సిన్ డోసులు ఇస్తూ వచ్చారు. ఇకపై 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా వ్యాక్సినేషన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేకంగా యువత కోసం 100 కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వ్యాక్సిన్ డోసులు వేస్తారు. ఈ కేంద్రాల్లో ఉచితంగానే టీకాలు వేస్తారు.

దీనిపై జీహెచ్ఎంసీ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ స్పందిస్తూ, 18 ఏళ్లకు పైబడిన వారు తమకు సమీపంలోని వ్యాక్సిన్ కేంద్రాలను సందర్శించాలని పిలుపునిచ్చారు. ముందుగా కొవిన్ పోర్టల్ లో తమ వివరాలు నమోదు చేసుకున్న తర్వాత, వ్యాక్సినేషన్ సెంటర్ కు వెళితే వేచి చూడాల్సిన అవసరం లేకుండా వెంటనే టీకా వేస్తారని వివరించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/