ఇళ్లల్లోనే గణేష్ పూజలు
మంత్రి ‘తలసాని’ విజ్ఞప్తి
![TS minister talasani review meeting](https://www.vaartha.com/wp-content/uploads/2020/08/TS-minister-talasani-review-meeting.jpg)
Hyderbad: కరోనా కారణంగా ఈ సంవత్సరం రాష్ట్రంలోని ప్రజలు అందరు గణేష్ ప్రతిమ లను తమ ఇండ్లలోనే ప్రతిష్టించి గణేష్ పండుగ ను సంప్రదాయ బద్ధంగా జరుపుకొని ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.
మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో హోం శాఖ మంత్రి శ్రీ మహామూద్ అలీ సమక్షంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్ లు అంజనీ కుమార్, సజ్జనార్, మహేష్ భగవత్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అద్యక్ష, కార్యదర్శులు రాఘవరెడ్డి, భగవంతరావు, విశ్వహిందు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు, ఇతర ప్రతినిధులతో మంత్రి శ్రీనివాస్ యాదవ్ సమావేశమయ్యారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి దృష్ట్యా ప్రజలు, గణేష్ ఉత్సవాల నిర్వాహకులు పరిస్థితులను అవగాహన చేసుకొని ఇండ్లలోనే విగ్రహాలను ప్రతిష్టించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుందన్నారు
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/