‘జైలర్‌’ నటుడు కన్నుమూత

చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం ప్రముఖ తమిళ నటుడు, డైరెక్టర్ జి. మారిముత్తు గుండెపోటు తో కన్నుమూశారు. 100కు పైగా సినిమాల్లో నటించిన ముత్తు.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.. తాజాగా విక్రమ్, జైలర్ సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించారు.. జైలర్‌లో విలన్‌కు నమ్మకస్తుడి పాత్రలో నటించి మెప్పించారు ముత్తు..

అయితే, ఈరోజు ఉదయం ఓ సీరియల్‌కి డబ్బింగ్ చెప్పారు. ఆ సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిందని చెబుతున్నారు.. బుల్లితెర సీరియల్స్‌లో నటిస్తున్న మారిముత్తు.. యాంటీ స్విమ్మింగ్ అనే సీరియల్‌తో ఫేమస్ అయ్యారు. దర్శకుడు వసంత్‌, ఎస్‌జే సూర్య దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఆ తర్వాత కన్నుమ్ కన్నుమ్, పులివాల్ అనే రెండు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత దర్శకుడు మిష్కిన్ దర్శకత్వంలో వచ్చిన యుద్ధంలో నటుడిగా అరంగేట్రం చేశాడు. మారిముత్తు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.