తప్పక తినాల్సిన పండ్లు..
పండ్లు-ఆరోగ్యం

వర్షాకాలంలో వచ్చే వ్యాధుల్ని ఎదుర్కొనేందుకు వ్యాధి నిరోధక శక్తిని పెంచే కొన్ని ప్రత్యేక పండ్లు తినాలి. చాలా మంది వర్షాకాలం వచ్చిందంటే గరం గరం సమోస, మిర్చి బజ్జీలు లాగించాలి అనిపిస్తుంది.
అయితే వర్షాకాల సీజన్లో రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు కొన్ని ప్రత్యేక పండ్లు తినాలి వర్షాకాలంలో వచ్చే వ్యాధులను దూరంగా ఉంచేందుకు మనకు అందుబాటులో ఉండే ఈ పండ్లు దోహదపడుతాయి
నేరేడు :
వర్షాకాలంలో ఎక్కువగా దొరికేవి నేరేడు పండ్లు. నేరేడును పండ్లలో రాజు అని కూడా అంటారు. ఇందులో కేలొరీలు తక్కువగా ఉంటాయి.
ఇనుము, ఫోలేట్, పొటాషియం విటమిన్లు అధికంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు నేరేడును తీసుకోవాలి. అజీర్తి సమస్యను ఇవి తగ్గిస్తాయి.
దానిమ్మ :
రోగనిరోధక శక్తి పెంచడంలో దానిమ్మ కీలక పాత్ర పోషిస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ రోజూ ఓ పండు తింటే ఆరోగ్యంగా ఉంటారు.

యాపిల్:
వర్షాకాలంలో జీవక్రియల రేటు కాస్త నిదానంగా ఉంటుంది. దీంతో శరీరం కూడా చురుగ్గా ఉండదు. కావున యాపిల్ ముక్కలు తింటే ఆరో గ్యంగా, చురుగ్గా కూడా ఉంటాం.
అరటి :
అరటిలో విటమిన్లూ, మినరల్స్ అధికంగా ఉంటాయి. జీర్న వ్యవస్థను శుభ్రం చేసే శక్తి అరటికి ఉంది. అజీర్తి సమస్య ఉండదు. పిల్లలకు రోజూ ఓ పండు తినిపించాలి.
దీంతో శరీ రానికి శక్తి అందడమే కాదు. పొట్ట నిండిన భావన కూడా కలుగుతుంది.
బొప్పాయి:
విటమిన్ ‘సి అధికంగా లభించే బొప్పాయి కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వానాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో పీచు ఎక్కువ. అయితే బొప్పాయిని మితంగా తీసుకుం టేనే మంచింది.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/