ఘట్కేసర్లో షాప్ కు వెళ్లిన నాలుగేళ్ల బాలిక కిడ్నాప్ ..
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో నాలుగేళ్ల బాలిక కృష్ణవేణి కిడ్నాప్ కలకలం రేపింది. బుధువారం రాత్రి 08 గంటల సమయంలో కిరాణ షాప్ కు వెళ్లిన బాలిక ఆ తర్వాత ఎంతసేపటికి ఇంటికి రాకపోవడం తో..తల్లిదండ్రులు వెతకడం మొదలుపెట్టారు. ఎంతవెతికిన పాప ఆచూకీ లభించకపోవడం తో పోలీసులుకు పిర్యాదు చేసారు.
బాలిక కిడ్నాప్ ఘటనతో అలర్టయిన పోలీసులు సీసీ ఫుటేజ్ లను పరిశీలించారు. మతి స్థిమితం లేని వ్యక్తి బాలికను ఓ వ్యక్తి తీసుకెళ్తున్నట్టు గుర్తించారు. డాగ్ స్క్వాడ్తో పాటు వేర్వేరు బృందాలుగా విడిపోయి బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు. గంటలు గడిచినా బిడ్డ జాడ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.