మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు మృతి

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఆదివారం ఉదయం మల్లూరు వద్ద జాతీయరహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారును అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని , క్షతగాత్రులను హాస్పటల్ కు తరలించారు.

మృతులను తండ్రీ కొడుకులైన శేఖర్‌, యశ్వంత్‌ (9), దంపతులు బాలనర్సయ్య, మణెమ్మగా, గాయపడినవారిని కవిత, అవినాశ్‌గా గుర్తించారు. వీరంతా నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌కు చెందినవారిగా గుర్తించారు. కామారెడ్డి నుంచి చేగుంటవైపు వెళ్తుంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.