సూర‌త్‌కు చెందిన త‌మ అభ్య‌ర్థిని బిజెపి కిడ్నాప్ చేసింది : మ‌నీశ్ సిసోడియా

‘Fearing loss in Gujarat polls, BJP thugs kidnapped our Surat (East) candidate’: AAP

న్యూఢిల్లీః కంచ‌న్ జ‌రీవాలాను బిజెపి కిడ్నాప్ చేసిన‌ట్లు ఆప్ నేత మ‌నీశ్ సిసోడియా ఆరోపించారు. గుజ‌రాత్‌లోని సూర‌త్‌కు చెందిన త‌మ అభ్య‌ర్థి కంచ‌న్ జ‌రీవాలా మంగ‌ళ‌వారం నుంచి క‌నిపించ‌డంలేద‌ని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. సూర‌త్ ఈస్ట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కంచ‌న్ జ‌రీవాలా ఆప్ త‌ర‌పున పోటీ చేయ‌నున్నారు. గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో ఓడిపోతామ‌న్న భ‌యంతో బిజెపి త‌మ అభ్య‌ర్థుల‌ను ఎత్తుకెళ్లుతున్న‌ట్లు ఆయ‌న ఆరోపించారు. నిన్న‌టి నుంచి కంచ‌న్‌తో పాటు ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు మిస్సింగ్‌లో ఉన్నార‌న్నారు. నామినేష‌న్ పేప‌ర్లు దాఖ‌లు చేసేందుకు ఆఫీసు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన కంచ‌న్‌ను బిజెపి గుండాలు ఎత్తుకెళ్లిన‌ట్లు డిప్యూటీ సీఎం సిసోడియా ఆరోపించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/