కాంగ్రెస్ పార్టీ లో చేరిన జూపల్లి

ఎన్నికలు సమీపిస్తుండడం తో అన్ని పార్టీలలో చేరికలు , వలసలు మొదలయ్యాయి. నిన్న బిజెపి లో మాజీ కాంగ్రెస్ నేత జయసుధ జాయిన్ కాగా..ఈరోజు జూపల్లి కృష్ణారావు తో పాటు పలువురు బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గురువారం ఉదయం ఢిల్లీలో ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో వీరంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ లో చేరిన వారిలో జూపల్లి కృష్ణారావు, మెగా రెడ్డి, DR కూచుకుంట్ల రాజేశ్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు.

కొల్లాపూర్ లో నిర్వహించే భారీ సభలో ప్రియాంక గాంధీ సమక్షంలో వీరంతా కాంగ్రెస్ లో చేరాలని భావించారు. కానీ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలోకొల్లాపూర్ లో సభను కాంగ్రెస్ పార్టీ వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో వీరంతా నేడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కేసీ వేణుగోపాల్, మానిక్ రావు థాక్రే, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, పొన్నం ప్రభాకర్ లు ఉన్నారు.