శ్రీశైలం ప్రాజెక్టుకు వరద.. మూడు గేట్లు ఎత్తివేత

Srisailam dam
Srisailam dam

హైదరాబాద్‌ః శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువనుంచి ప్రాజెక్టుకు 1,23,937 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు మూడు గేట్లను పది అడుగుల మేర ఎత్తి 1,54,992 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.4 అడుగుల వద్ద నీరు ఉన్నది. ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు. ఇప్పుడు 212.43 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది.

కాగా, జిల్లాలోని పాలేరు ప్రాజెక్టుకు వరదనీరు పోటెత్తింది. ఎగువన భారీ వర్షాలకు జలాశయానికి 25 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 24 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌, నల్లగొండ జిల్లాల్లో వర్షాలతో పాలేరు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/