విజయవాడ నుండి షార్జాకు విమాన సర్వీసులు ప్రారంభం

విజయవాడ నుంచి నేరుగా షార్జాకు విమాన సర్వీసును సోమవారం ప్రారంభమైంది. ఈ సర్వీసును గన్నవరం విమానాశ్రయం నుంచి వైస్సార్సీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి, టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్సార్సీపీ, టీడీపీ పార్టీలకు చెందిన ఇద్దరు ఎంపీలు షార్జా విమానం ఎక్కిన ప్రయాణికులకు బోర్డింగ్ పాసులు అందజేశారు.

వారంలో రెండు రోజుల పాటు నడవనున్న విజయవాడ షార్జా విమానం… ముందుగా షార్జా నుంచి విజయవాడ చేరుకుని ఆ వెంటనే తిరిగి షార్జా బయలుదేరుతుంది. సోమ, శనివారాల్లో ఈ సర్వీసులు నడవనున్నాయి. ఇందులో భాగంగా సర్వీసు ప్రారంభమైన సోమవారం 55 మంది ప్రయాణికులతో షార్జా నుంచి గన్నవరం చేరిన ఎయిరిండియా విమానం…125 మంది ప్రయాణికులతో తిరిగి షార్జాకు తిరుగు ప్రయాణమైంది.