గుంటూరు జిల్లా జగన్‌ పర్యటనలో ఫ్లెక్సీ కలకలం

Flexi stirs during Jagan visit to Guntur district

అమరావతిః గుంటూరు జిల్లా నల్లపాడులో ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా ఓ ఫ్లెక్సీ కలకలం రేపింది. ‘అన్నా… జగనన్న… నల్లపాడు గ్రామంలో మీ నాయకులు దోచుకున్న సర్వే నెం. 543, 546, 550లో గల వాగు పోరంబోకు భూమిని కాపాడు అన్నా’ అంటూ చల్లా ఆదిరెడ్డి అనే వ్యక్తి ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ స్థానికంగా కలకలం రేపుతోంది. నల్లపాడులో క్రీడాజ్యోతిని వెలిగించి… ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి.