ఆకాశంలో 5 గ్రహాలు ఒకే కక్షలో కనువిందు

ఆకాశంలో అద్భుతం జరిగింది. 5 గ్రహాలు ఒకే కక్షలో కనువిందు చేసాయి. గురుడు, బుధుడు, శుక్రుడు, యురేనస్, అంగారకుడు ఒకే కక్షలోకి దగ్గరగా వచ్చాయి. ఆ గ్రహాలతో పాటు చంద్రుడు సైతం కలిసి కనువిందు చేసాడు. సూర్యాస్తమయం తర్వాత పశ్చిమం వైపు 50 డిగ్రీల పరిధిలో ఈ ఐదు గ్రహాలు కనువిందు చేసాయి. ఈ అద్భుతాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వీక్షించి ఆనందించారు. ఈ గ్రహాలు అన్నీ సూర్యూడు చుట్టూ తిరుగుతూనే ఒక సమయంలో ఆర్క్ లాగా దృశ్యం ఆవిష్కృతమైంది. వీటిలో గురుడు, శుక్రుడు, అంగారక గ్రహాలను నేరుగా కళ్లతో చూసేందుకు వీలుంది. బుధుడు, యురేనస్ ని మాత్రం బైనాక్యులర్ లాంటి పరికరాలతో చూసే పరిస్థితి ఏర్పడింది.

కృతిమ కాంతి తక్కువగా ఉన్నటువంటి గ్రామాల్లో అయితే ఎంతో స్పష్టంగా చూడచ్చు. ఎత్తైన భవనాలు, చెట్లు లాంటివి అడ్డుగా లేకుండా స్పష్టమైన ఆకాశం కనిపిస్తుంటే ఎక్కడైనా ఈ దృశ్యాలను చూడచ్చు. ఇది ఆకాశంలో పశ్చిమంగా దర్శనమిస్తున్నాయి. వీటిలో బుధుడి కంటే గురు గ్రహం మరింత ప్రకాశవంతంగా ఉండటం విశేషం. శుక్రగ్రహం ప్రకాశంగా కనిపించనుంది. దానికి దగ్గర్లో ఉండే యురేనస్ అంత ప్రకాశంగా ఉండకపోవడం వల్ల నేరుగా చూసేందుకు వీలులేదు. కాబట్టి యురేనస్ ని మాత్రం బైనాక్యులర్ తో చూడాలంటూ శాస్త్రవేత్తలు సూచించారు.