హోట‌ల్ లో దోశ‌లు వేసిన ప్రియాంక‌గాంధీ..

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో నేతలు ఎక్కడ తగ్గడంలేదు. ఓటర్లను ప్రసన్నం చేసేందుకు నానా తంటాలు పడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ హోటల్ లో దోశలు వేసి సందడి చేసారు. మైసూరులో ర్యాలీ చేసిన ఆమె ఓ హోటల్‌కి వెళ్లారు. టిఫిన్ చేసేసి వస్తారేమో అనుకున్నారంతా. కానీ ఆమె నేరుగా హోటల్‌లోని కిచెన్‌లోకి వెళ్లారు. అక్కడి వాళ్లను పలకరించారు. పక్కనే దోశ పిండి గిన్నె కనబడగానే తన చేతికి పని చెప్పారు.

అక్కడి సిబ్బందితో మాట్లాడుతూనే పెనంపై దోశలు వేశారు ప్రియాంక గాంధీ. అట్లకాడ తీసుకుని చాలా నింపాదిగా వాటిని అటూ ఇటూ తిప్పారు. దోశలు రెడీ చేసిన తరవాత హోటల్‌ ఓనర్‌తో కాసేపు సరదాగా ముచ్చటించారు. వాళ్లందరితో కలిసి సెల్ఫీ కూడా తీసుకున్నారు. ఈ వీడియోని తన ట్విటర్‌లో షేర్ చేశారు ప్రియాంక.

ప్రఖ్యాత మైలారి హోటల్ ఓనర్లతో కలిసి దోసెలు వేయడాన్ని ఎంజాయ్ చేశానని ఆమె అన్నారు. తమకు ఇంత మంచి ఆతిథ్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దోసెలు ఎంతో రుచికరంగా ఉన్నాయని చెప్పారు. తన కూతురును ఇక్కడకు తీసుకొచ్చి రుచి చూపిస్తానని అన్నారు.