విశాఖలో దారుణం.. బాలికను బ్లాక్ మెయిల్ చేసి 20 రోజుల పాటు నరకం చూపించారు

ఏపీలో రోజు రోజుకు ఆడవారికి , బాలికలకు రక్షణ లేకుండాపోతుంది. ప్రభుత్వం ఆడవారికి అన్ని విధాలా రక్షణ కల్పిస్తున్నామని చెపుతున్న, పలు శిక్షలు అమలుచేస్తున్న కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. నిత్యం ఆడవారి ఫై గ్యాంగ్ రేప్ లు , అత్యాచారాలు , కిడ్నాప్ లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా విశాఖ లో ఓ నేవీ అధికారి కుమార్తెపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది.

వివరాల్లోకి వెళ్తే..

విశాఖ లోని 104 ఏరియాలో నివాసం ఉంటున్న నేవీ అధికారికి పదో తరగతి చదివే కుమార్తె ఉంది. ఆమె చదువుతున్న పాఠశాలలో అటెండర్ గా పనిచేస్తున్న సత్యారావు ఆ బాలికతో చనువు పెంచుకున్నాడు. ఓ రోజు బాలికను వివస్త్రను చేసి సెల్ ఫోన్లో చిత్రీకరించాడు. తరువాత ఆ దృశ్యాలను చూపి బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆ పిక్స్ ను స్నేహితులకు పంపించాడు. వారు సైతం బ్లాక్ మెయిల్ కు దిగుతూ బాలికను లొంగదీసుకున్నారు. ఇలా 20 రోజుల పాటు బాలికపై అఘాయిత్యం కొనసాగుతునే ఉంది.

బాలిక ప్రవర్తనలో మార్పు కనిపించింది. చాలా నీరసంగా ఉండడంతో తల్లిదండ్రులు ఆరాతీశారు. దీంతో ఆ బాలిక జరిగిన విషయాన్ని వారికి చెప్పింది. వెంటనే నేవీ అధికారి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సత్యారావును అరెస్ట్ చేశారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన నగరంలో సంచలనం రేకెత్తించింది.