అర్ధరాత్రి రోడ్డు మధ్యలో ఆగిపోయిన APSRTC బస్సు ..తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు

విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్న గుడివాడకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు మార్గమధ్యలో అర్ధరాత్రి ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా బస్టాండ్ లో ఉండగానే బస్సు టైరు బాగాలేదని, ప్రత్యామ్నాయంగా మరో బస్సు అరెంజ్ చేయాలని అధికారులకు డ్రైవర్ తెలిపారు. అయినప్పటికీ అధికారులు వినకుండా అదే బస్సునే పంపడంతో మార్గంమధ్యంలో కంచికచర్ల ఫ్లై ఓవర్ వద్ద టైరు నుండి వాసన రావడంతో డ్రైవర్ బ్రేక్డౌన్ చేసి బస్సును పక్కన నిలిపివేశారు.

బస్సు మధ్యలోని ఆగిపోవడంతో జోరు వానలో ఐదు గంటలుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సు కిటికీ అద్దాలు సరిగా లేకపోవడంతో సీట్లు తడిచిపోయి ప్రయాణికులు తడిచిపోయారు. ఇంత జరుగుతున్నా ఆర్టీసీ అధికారులు కనీసం స్పందించలేదని , మరో బస్సు ను పంపలేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సులో దాదాపు 30 మంది ఉన్నారు.