నాంపల్లిలోని హజ్ హౌస్ లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ మహానగరంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతాగున్నాయి. ప్రతి రోజు ఎక్కడో ఓచోట అగ్ని ప్రమాద ఘటన వెలుగులోకి వస్తుంది. సోమవారం నాంపల్లిలోని హజ్ హౌస్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉర్దూ అకాడమీ కార్యాలయంలో ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించాయి. సిబ్బంది కార్యాలయానికి తాళాలు వేసి వెళ్లి పోవడంతో ప్రాణాపాయం తప్పింది.

విలువైన డాక్యుమెంట్లు మంటలో కాలిపోయాయి. అగ్ని ప్రమాద విషయాన్నీ హజ్ హౌస్ సెక్యూరిటీ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వచ్చిన పైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు ఎగసి పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.