ఢిల్లీ ఎయిమ్స్లో భారీ అగ్ని ప్రమాదం

ఢిల్లీ: ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లోని కార్డియో థొరాసిక్ సైన్సెస్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 10 ఫైరింజన్లతో మంటలను ఆర్పారు. ఈ కేంద్రంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఎలెక్ట్రిక్ ప్యానెల్నుంచి మంటలు ప్రారంభమయ్యాయి. దీనితో ఐసియులో పొగ కమ్ముకోవడంతో అక్కడ చికిత్స పొందుతున్న 28 మంది రోగులను ఇతర వార్డులకు తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/