అమరావతి : ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మహిళా సంక్షేమం, వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్ లో అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చామని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా బడ్జెట్ రూపొందించామని తెలిపారు.