కోడి కూర..కొడుకు చంపేలా చేసింది

ఈ మధ్య క్షణికావేశంలో ఏంచేస్తున్నారో కూడా తెలియడం లేదు..చిన్న చిన్న వాటికే క్షణికావేశంతో ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా కోడి కూర విషయంలో క్షణికావేశం తో కన్నకొడుకును చంపేశాడు ఓ తండ్రి. ఈ ఘటన కర్ణాటక లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

కర్ణాటకలో షీనా అనే వ్యక్తి తన భార్యా పిల్లలతో కలిసి దక్షిణ కన్నడ జిల్లాలోని సూలీయా తాలూకా గుత్తిగర్ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం ఇంట్లో వండిన కోడి కూర మొత్తాన్ని షీనా తినేశాడు. ఆ తరువాత ఇంటికొచ్చిన కొడుకు శివరామన్‌కు కోడి కూర లేకపోవడం తో తండ్రితో గొడవపడ్డాడు. ఈ గొడవ కాస్త చిలికిచిలికి గాలివానగా మారింది. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయిన షీనా.. శివరామన్‌ ను కర్రతో గట్టిగా తలపై కొట్టాడు. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయి అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలానికి దారితీసింది.