ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Road Accident
Road accident

అమరావతిః ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం కస్తూర్బా పాఠశాల వద్ద బొలెరో వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో బొలెరో డ్రైవర్‌తో పాటు బైక్‌పై ఉన్న భార్యభర్తలు మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/