ఉద్యోగ విరమణ వయోపరిమితి 61 ఏళ్లకు పెంపుదల

తెలంగాణ శాసనసభ ఆమోదం

TS Assembly
TS Assembly

Hyderabad: శాసన సభలో గురువారం పలు బిల్లులు ఆమోదం పొందాయి. ఉద్యోగ విరమణ వయోపరిమితిని 61 ఏళ్లకు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఈ బిల్లును శాసనసభ ఆమోదించింది. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పింఛను పెంపు బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. కనీస పింఛను రూ.50 వేలు, గరిష్ఠ పింఛను రూ. 70 వేలకు పెంచారు.

అంతేకాకుండా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల వైద్య ఖర్చుల పరిమితిని రూ. లక్షనుంచి రూ.10 లక్షలకు పెంచుతూ.. వైద్య ఖర్చుల పెంపు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సభ్యులందరికి పెన్షన్స్ పెంచాలని సీఎంను మాజీ ఎమ్మెల్యేలు కలిశారని మంత్రి హరీష్ రావు తెలిపారు.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/