దేశవ్యాప్తంగా కరోనా పంజా !
24 గంటల్లో 53,476 కేసులు, 251 మంది మృతి
New Delhi: రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. హెల్త్ బులిటెన్ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 53,476 కరోనా కేసులు నమోదయ్యాయి.
గడిచిన 133 రోజుల్లో ఇన్ని కేసులు నమోదవడం గమనార్హం. 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనాతో 251 మంది మృతి చెందారు. దేశంలో 3,95,192 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటి వరకూ 5.31 కోట్ల మందికి కోవిడ్ టీకా అందజేసినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/