ప్రత్యేక రైళ్ల సర్వీసుల పొడిగింపుః దక్షిణ మధ్య రైల్వే
న్యూఢిల్లీః వేసవిలో ప్రయాణికుల రద్దీ పెరగనున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పలు ప్రాంతాల మధ్య సేవలందిస్తోన్న 32 ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగించేందుకు నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకూ నిర్దేశిత తేదీల్లో ఈ సర్వీసులు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.