ముగిసిన చలాన్ల రాయితీ గడువు.. రూ.150.3 కోట్లు వసూలు

తెలంగాణ ట్రాఫిక్ చలాన్లపై రాయితీ గడువు నిన్నటితో ముగిసింది. గత ఏడాది డిసెంబర్ 26 నుంచి నిన్నటివరకు 1.67 కోట్ల చలాన్లకు రూ.150.3 కోట్లు వసూలు అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అత్యధికంగా HYD కమిషనరేట్ పరిధిలో రూ.37.14 కోట్లు, అత్యల్పంగా ములుగు జిల్లాలో రూ.19.15 లక్షలు వసూలయ్యాయని తెలిపింది. మొత్తం పెండింగ్ చలాన్లలో 46.36% మాత్రమే క్లియర్ అయినట్లు పేర్కొంది.

కాగా ట్రాఫిక్ చలాన్ల రాయితీ ప్రకారం..ఆటోలు, ఫోర్ వీలర్లకు 60 శాతం, టూ వీలర్లకు 80 శాతం, ఆర్టీసీ బస్సులు ,తోపుడుబండ్లపై 90% రాయితీ కల్పించింది. భారీ వాహనాల పై 50% రాయితీని కల్పించింది. తెలంగాణ రాష్ట్రంలో రెండు కోట్లకు పైగా పెండింగ్ చలాన్లు ఉండడంతో ఈ మేరకు పోలీస్ శాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.