కాసేపట్లో ఈటల రాజేందర్ పాదయాత్ర ప్రారంభం

ప్రజా జీవనయాత్ర పేరుతో పాదయాత్ర
23 రోజులు కొనసాగనున్న పాదయాత్ర

హైదరాబాద్ : మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ కాసేపట్లో తన పాదయాత్రను ప్రారంభించబోతున్నారు. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన చేపట్టబోతున్న తొలి కీలకమైన రాజకీయ కార్యాచరణ ఇదే కావడం గమనార్హం. ఈ పాదయాత్రకు సంబంధించి బీజేపీ శ్రేణులు, ఈటల అనుచరులు భారీ ఏర్పాట్లను చేశారు. పాదయాత్రలో పాల్గొనేందుకు ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుతో పాటు పలువురు బీజేపీ నేతలు వచ్చారు. ఈ పాదయాత్రకు ‘ప్రజా జీవనయాత్ర’ అనే పేరు పెట్టారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం బత్తినవారిపల్లి నుంచి ఈటల పాదయాత్ర ప్రారంభంకానుంది. 107 గ్రామపంచాయితీల పరిధిలోని 127 గ్రామాల్లో.. 270 కిలోమీటర్ల దూరం ఈటల పాదయాత్ర చేయనున్నారు. ఈరోజు (తొలిరోజు) శనిగరం, మాదన్నవీధి, గురిపర్తి, శ్రీరాములపేట, అంబల గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. నియోజకవర్గంలో పలు గ్రామాల మీదుగా 23 రోజుల పాటు పాదయాత్ర కొనసాగనుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/